హైదరాబాద్ : గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నగరంలోని ప్రసిద్ధ గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కె. రవీంద్రనాథ్ తెలిపారు. తన సంపదలో 70 శాతాన్ని ఫౌండేషన్కు ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఫౌండేషన్ ఏర్పాటుపై గ్లోబల్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు ఈ మేరకు మంగళవారం ప్రకటన చేశారు. రూ.350 కోట్లతో ఫౌండేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన రవీంద్రనాథ్.. హెల్త్ వర్సిటీ, పరిశోధన హబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గ్లోబల్ హాస్పిటల్స్. చైర్మన్గా డాక్టర్ కె.రవీంద్రనాథ్ 1999లో దీన్ని స్థాపించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తన శాఖలను కలిగిఉంది. కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులతో సహా ఇతర అవయవ మార్పిడిలో ఆస్పత్రి ప్రసిద్ధి. 2 వేల పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రతీ ఏడాది 3 లక్షల మంది ఔట్ పేషెంట్స్, 50 వేల మంది ఇన్ పేషెంట్స్గా చికిత్స పొందుతున్నారు. ప్రతీ ఏడాది 18 వేల సర్జరీలు నిర్వహిస్తుంటారు. భారతదేశ ప్రముఖ సర్జన్లలో ఒకరైన కె. రవీంద్రనాథ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ పూర్వవిద్యార్థి. గ్లాస్గో & ఎడిన్బర్గ్ రాయల్ కాలేజీ ఆఫ్ సర్జన్స్కు చెందిన ఫెలో.