4,693 మందికి పాజిటివ్
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిశ్చార్జీలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 6,876 మంది కోలుకున్నట్టు బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. దీంతో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 4.56 లక్షలు దాటింది. రాష్ట్రంలో రికవరీ రేటు 88.42 శాతానికి పెరుగగా, జాతీయ సగటు 83.2 శాతంగా ఉన్నది. మరోవైపు కొత్తగా 4,693 మందికి పాజిటివ్గా తేలింది. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 33 మంది మరణించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 734, రంగారెడ్డి జిల్లాలో 296, మేడ్చల్ మల్కాజిగిరిలో 285, నల్లగొండలో 296, కరీంనగర్లో 209, వరంగల్ అర్బన్లో 161 కేసులు వెలుగుచూశాయి.