హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ ) రెండోవిడత సీట్ల కేటాయింపును ఉన్నత విద్యామండలి అధికారులు బుధవారం పూర్తిచేశారు. 66,641 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ తదితరులు విద్యార్థులకు సీట్ల కేటాయింపును పూర్తిచేశారు. 44,301 మంది మొదటి ప్రాధాన్యత ఆప్షన్ ఎంచుకున్న కాలేజీల్లోనే సీట్లు దక్కించుకోగా.. 22,340 మంది రెండో ప్రాధాన్య ఆప్షన్గా ఎంచుకున్న కాలేజీల్లో సీట్లు పొందారు. 8,757 మంది ఆప్షన్లు ఎంచుకున్నా సీట్లు దక్కించుకోలేకపోయారు. వీరు మూడోవిడతలో సీట్ల కోసం పోటీపడాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి సీట్లను ఖరారు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి మూడోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానున్నది. సీట్ల కేటాయింపును సెప్టెంబర్ 24న పూర్తిచేసి.. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించనున్నారు.
షెడ్యూల్ తేదీలు
రూ. 400తో రిజిస్ట్రేషన్ 27-8-21 నుంచి 15- 9-21
వెబ్ ఆప్షన్లు 27-8-21 నుంచి 20-9-21
వికలాంగుల ధ్రువపత్రాల పరిశీలన 15-9-2021
సీట్ల కేటాయింపు 24-9-21
ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ 24-9-21 నుంచి 27-9- 2021
కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడం 24-9-21 నుంచి 27-9- 2021
ఇంట్రా కాలేజీ (సీటు వచ్చిన కాలేజీలో)
ైస్లెడింగ్ వెబ్ ఆప్షను 28-9-21 నుంచి 29-9-21
ఇంట్రా కాలేజీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు 30-9-21
ఓరియంటేషన్ 24-9-21 నుంచి 30-9-21
తరగతుల ప్రారంభం 1-10-21 నుంచి