హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 648 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,14,928 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 648 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్-19తో తాజాగా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. 696 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,39,369కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,857గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3,774 మంది చనిపోయారు. జిల్లాల వారీగా నమోదైన కొవిడ్ పాజిటివ్ కేసుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.