వెంగళరావునగర్, జూన్ 1: కరోనా చికిత్స కోసం యునానీ పరిశోధనల ద్వారా రూపొందించిన ఆయుష్-64 మందును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్రెడ్డి మంగళవారం విడుదలచేశారు. హైదరాబాద్ వెంగళరావునగర్ డివిజన్ ఎర్రగడ్డ యునానీ కేంద్ర పరిశోధనా సంస్థ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందల ఏండ్ల కిందటే కరోనా కంటే భయంకరమైన అంటువ్యాధులను ఆయుర్వేద, సిద్ధ, యునానీ వంటి ప్రకృతి ప్రసాదించిన భారతీయ వైద్య విధానంతో తరమికొట్టిన ఘనత దేశానిదని పేర్కొన్నారు. ప్రకృతి వైద్యాన్ని సక్రమంగా వినియోగిస్తే ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టంచేశారు. కార్యక్రమంలో దవాఖాన డైరెక్టర్ ఖజ్మీ, సేవాభారతి సంస్థ అధ్యక్షులు దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.