హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయంలో రోజుల వ్యవధిలో 61 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో సచివాలయానికి వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. సీఎస్, చీఫ్ సెక్యూరిటీ అధికారి సహా మిగతాశాఖల్లోని ఉద్యోగులు వరుసగా పాజిటివ్గా తేలారు. దీంతో ఎప్పుడు ఎవరికి పాజిటివ్ వస్తుందోనని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నూతన సచివాలయ భవన నిర్మాణం కోసం, సచివాలయాన్ని బీఆర్కేభవన్కు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ తక్కువ స్థలంలోనే సర్దుబాటు చేయాల్సిరావడంతో ఉద్యోగులంతా దగ్గరదగ్గరగా కూర్చోవాల్సి వస్తున్నది. వైరస్ విస్తరిస్తున్నందున సిబ్బందిని రెండుగా విడగొట్టి రోజువిడిచి రోజు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్రావు సోమవారం రాసిన లేఖలో సీఎం కేసీఆర్ను కోరారు. సచివాలయ డిస్పెన్సరీలో కొవిడ్ టెస్ట్లు నిర్వహించేలా ఆదేశించాలని, పాజిటివ్ వచ్చిన ఉద్యోగులకు 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరుచేయాల, బాధిత ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ను రూ.3 లక్షలకు పెంచాలని సీఎంను కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని సీఎస్ సోమేశ్కుమార్కు అందజేశారు.