అశ్వారావుపేట టౌన్, ఏప్రిల్ 20: ఆరేం డ్ల చిన్నారికి అప్పుడే నూరేండ్లు నిండాయి. తన తమ్ముడి కోసం చీరతో కట్టిన ఉయ్యాలలో సరదాగా ఊగుతుండగా మెడకు చుట్టుకొని ఊపిరి వదిలాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం చోటుచేసుకున్నది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన రవికుమార్ అశ్వారావుపేటలోని యూనియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మంగళవారం చిన్న కుమారుడికి తల్లి నందిని అన్నం తినిపిస్తుండగా పెద్ద కొడుకు సాహంత్ (6) వరండాలో చీరతో కట్టిన ఉయ్యాలతో ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటి తరువాత తల్లి వెళ్లి చూసేవరకు సాహంత్ మెడకు చీర చుట్టుకుని ఉన్నది. ఇరుగుపొరుగు సాయంతో దవాఖానకు తీసుకెళ్లగా బాలుడు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.