పెద్దపల్లి: జిల్లాలోని రాఘవాపూర్ వద్ద దివ్యాంగురాలైన ఆరేండ్ల బాలిక రైలులోనుంచి కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం పెద్దపల్లి మండలం రాఘవాపూర్లోని 42వ రైల్వే గేట్ వద్ద హైదరాబాద్ నుంచి బల్లార్షా వైపు వెళ్తున్న రైలులో నుంచి ఓ బాలిక కింద పడింది. గుర్తించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో వారు ఆ బాలికను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, బాలికే కింద పడిందా లేదా ఎవరైనా తోసేశారా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉందని చెప్పారు. ఆ బాలికకు మతి స్థితి లేకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.