హైదరాబాద్: కొవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు కొనసాగుతున్నాయి. కొవిడ్ ప్రోటోకాల్ పాటించని, కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నది. తాజాగా రాష్ట్రంలోని మరో 6 హాస్పిటళ్లలో కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు చేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 16 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సను ప్రభుత్వం రద్దు చేసింది.