ఈ ప్యాకేజీలతో ఎవరికి లబ్ధి: కేటీఆర్
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో కేంద్రం రూ.6 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడంపై ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ తీరుకు అద్దం పట్టే ఓ కార్టూన్ను పోస్ట్చేసిన మంత్రి, కొందరు నేతలు గొప్పగా చెప్పుకునే ఈ ప్యాకేజీల వల్ల దేశంలో ఎవరికి లబ్ధి అని ప్రశ్నించారు. గతంలో ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ అబద్ధంగా మారగా, ఇప్పుడు రూ.6 లక్షల ప్యాకేజీ కూడా మరో అబద్ధంగా మారనుందా? అని అనుమానం వ్యక్తంచేశారు.