ఆసిఫాబాద్ అడవుల్లో పురాజీవ అవశేషం
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీరేంజ్లోని గోయెనా గుట్టల మీద సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద జీవించిన నత్తల శిలాజాన్ని పరిశోధకులు గుర్తించారు. పబ్లిక్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ ఆండ్ హెరిటేజ్ (ప్రిహా) జనరల్ సెక్రటరీ ఎంఏ శ్రీనివాసన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి తోడిశెట్టి ప్రణయ్ శిలాజాలను సేకరించారు. వాటిని పరిశీలించిన పురాజీవ శాస్త్రవేత్త, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనలర్ చకిలం వేణుగోపాలరావు గోయెనా గుట్టల్లో కనిపిస్తున్న నత్తలు పైజా తిర్పొలెన్సిన్ జాతికి చెందినవని నిర్ధారించారు.