సికింద్రాబాద్, జూన్ 6: కరోనా నివారణ, బాధితులను ఆదుకోవడంతో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. హెల్పింగ్ హార్ట్స్ నిర్వాహకురాలు, టీఆర్ఎస్ నేత మణిమంజరి ఆధ్వర్యంలో సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో వ్యాక్సిన్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆశవర్కర్స్, డాక్టర్లకు శానిటైజర్లు, మాస్క్ల పంపిణీ జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ..స్వచ్ఛంద సంస్థలు కరోనా బాధితులకు ఇళ్లలోకి ఉచితంగా భోజనం అందజేస్తునందుకు ప్రశంసించారు. కొన్ని సందర్భాలలో బంధువలే దూరదూరంగా ఉంటున్న తరుణంలో ఇలాంటి సేవలు అందించడం హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమ తదితరులు పాల్గొన్నారు