కమర్షియల్ కోర్టులకు 58 పోస్టులు మంజూరు

మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఆర్థికశాఖ
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న రెండు కమర్షియల్ కోర్టులకు 58 పోస్టులను మంజూరుచేస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈవోడీబీ సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో రెండు కమర్షియల్ కోర్టులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో కోర్టుకు 29 పోస్టులను మంజూరుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారపరమైన లావాదేవీలకు సంబంధించిన వివాదాలను ఈ రెండు కోర్టులు పరిష్కరించనున్నాయి. ఈ రెండు కోర్టులకు జిల్లాస్థాయి జడ్జి హోదా ఇచ్చారు. రెండింటికీ కలిపి ఇద్దరు జిల్లా జడ్జీలు, సూపరిటెండెంట్, పది మంది జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు టైపిస్టులు, ఫిల్డ్ అసిస్టెంట్లు, ప్రాసెస్ సర్వర్, పది మంది అటెండర్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఇద్దరు ఎగ్జామినర్లు, ఇద్దరు కాపీయిస్ట్లు ఇలా 58 పోస్టుల మంజూరయ్యాయి.
తాజావార్తలు
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.91 లక్షల మందికి కరోనా టీకా