హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 7,994 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్లో తెలిపింది. మొత్తం డిశ్చార్జిల సంఖ్య 4.20 లక్షలు దాటింది. రికవరీరేటు 85.54 శాతానికి పెరుగగా.. జాతీయ సగటు 81.9 శాతంగా ఉన్నది. కొత్తగా 5,186 మందికి పాజిటివ్గా తే లింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 904, రంగారెడ్డిలో 339, మేడ్చల్ మల్కాజిగిరిలో 366, నల్లగొండలో 317, వరంగల్ అర్బన్లో 231, కరీంనగర్లో 182 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాల వల్ల 38 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 68 వేలకు తగ్గింది. మధ్యాహ్నానికి రాష్ట్రవ్యాప్తంగా 25,367 పడకలు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో 7,420 పడకలు ప్రభుత్వదవాఖానల్లో, 17,947 ప్రైవే ట్దవాఖానల్లో అందుబాటులో ఉన్నాయి.