హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ చికిత్స అందిస్తున్న అన్ని దవాఖానలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం నూతన మార్గదర్శకాలను జారీచేసింది. పేషెంట్లలో షుగర్ స్థాయిని నియంత్రిస్తూ ఉండాలని, ఆంఫో-బీ చికిత్స అందిస్తున్నప్పటికీ హైపోకలేమియా చెక్ చేసేందుకు ఆర్ఎఫ్టీ, సీరం ఎలక్ట్రోలైట్స్ను ప్రతిరోజూ మానిటరింగ్ చేయాలని ఆదేశించింది. యాంఫోటెరిసిన్-బీ (క్రిస్టలిన్)కు ప్రాధా న్యం ఇవ్వాలని, ఆర్ఎఫ్టీ లేదా ఎల్ఎఫ్టీ తట్టుకోలేని పరిస్థితుల్లో లిపిడ్ కాంప్లెక్స్ లేదా లైపోసోమల్ ఆంఫో-బీ వినియోగించాలని సూచించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు ఈ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీచేసింది.