సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ వైద్యుడి నిర్వాకం
సస్పెండ్ చేసిన డీఎంహెచ్వో డాక్టర్ కోటాచలం
పెన్పహాడ్, ఏప్రిల్ 26: కరోనావిజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. పలువురు వైద్యాధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ మచ్చ తెస్తున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఆయుష్ వైద్యుడు క్రాం తికుమార్ పరీక్షలకు వచ్చినవారి నుంచి రూ.500 వసూలు చేసినట్టు సామాజికమాధ్యమాల్లో వైరల్ అయింది. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశాలతో అదనపు కలెక్టర్ పద్మజారాణి, డీఎంహెచ్వో డాక్టర్ కోటాచలం విచారించారు. వీడియోలో డాక్టర్తో వాదిస్తున్న అనంతారానికి చెందిన సురేశ్తో మాట్లాడారు. వైద్యుడిని విధుల్లోంచి తొలగించారు.