న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్పై బ్రెజిల్ వినియోగదారుల హక్కుల సంస్థ.. ప్రొకాన్-ఎస్పీ.. 20 లక్షల డాలర్ల ఫైన్ విధించింది. వినియోగదారులకు ఆపిల్ కొత్తగా విపణిలో ఆవిష్కరించిన ఐఫోన్-12 సిరీస్ ఫోన్తోపాటు చార్జర్ ఇవ్వనందుకు ఈ ఫైన్ విధించినట్లు తెలిపింది. వాణిజ్య ప్రకటనల్లో యూజర్లను తప్పుదోవ పట్టిస్తూ.. చార్జర్ లేకుండా స్మార్ట్ ఫోన్ విక్రయించడం అనుచితం అని ప్రొకాన్-ఎస్పీ వ్యాఖ్యానించింది. చార్జర్, ఇయర్బడ్స్ ఇవ్వనందుకు ఐఫోన్-12 సిరీస్ ఫోన్ ధర తగ్గించాలని కోరినా ఆపిల్ సానుకూలంగా ప్రతిస్పందించలేదు. బ్రెజిల్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు, సంస్థలు ఉన్నాయని ఆపిల్ అర్థం చేసుకోవాల్సి ఉందని ప్రోకాన్-ఎస్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెర్నాండో కాపేజ్ పేర్కొన్నారు.
గతేడాది అక్టోబర్ నెలలో ఆపిల్ తన న్యూ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐఫోన్-12 సిరీస్ను చార్జర్, ఇయర్బడ్స్ లేకుండా విక్రయిస్తామని ప్రకటించింది. కర్బన ఉద్గారాల నియంత్రణకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. దీనికి తోడు ఈ విడి భాగాలను తాము తయారు చేయడం లేదని, దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. అయితే, ఆపిల్ ఉపాధ్యక్షుడు లీసా జాక్సన్ మాత్రం యూజర్లు వైర్లెస్ చార్జింగ్ పద్దతుల్లో పవర్ అడాప్టర్లను రీప్లేస్ చేసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
మేడిన్ ఇండియా: మనకో యాప్ స్టోర్..‘మొబైల్ సేవా యాప్ స్టోర్’
జియో న్యూ ఫీచర్ ప్లాన్తో ఎయిర్టెల్, వొడాఫోన్ విలవిల
బాలిక భవితవ్యానికి సుకన్య.. పీపీఎఫ్ల్లో ఏది బెస్ట్!
ఏప్రిల్లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
అలాగైతే టెస్లాను మూసేస్తా: ఎలన్ మస్క్ సవాల్