హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిన్న ఒక్కరోజే ప్రభుత్వ, ప్రయివేటు కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో 5 లక్షల మందికి టీకాలు వేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు శనివారం వెల్లడించారు.
శుక్రవారం రోజు మొత్తం 5,02,519 మందికి వ్యాక్సిన్ వేయగా, ఇందులో 3,71,169 మంది ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. 1,31,350 మంది సెకండ్ డోస్ తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 2.36 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో 1,71,74,566 మంది ఫస్ట్ డోస్ తీసుకోగా, 64,42,430 మంది సెకండ్ డోస్ తీసుకున్నారు.