హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతిలో అడ్మిషన్లు కల్పించేందు కు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం విడుదల చేశారు. 46,491 మంది అర్హత సాధించినట్టు మంత్రి ప్రకటించారు. మొత్తం 604 పాఠశాలల్లో 48,320 సీట్లు ఉండగా.. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకే 50 శాతం సీట్లు కేటాయించనున్నారు.