హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 14 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయం స్థానం నిర్ణయం తీసుకుంది.