హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాల్లో మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ (ఎంఎల్ఏపీ) కార్యక్రమంలో భాగంగా 447 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటా రు. పది జిల్లాలు ఇప్పటివరకు నిర్దేశించిన లక్ష్యాన్ని దాటి ముందు కు సాగుతున్నాయి. తెలంగాణకు హరితహారంలో మొక్కలు నాటడమే కాకుండా రోడ్లకు ఇరువైపులా బహుళ వరుసల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో రంగురంగుల పూలమొక్కలు, గుబురు మొక్కలు ఉండేలా చూడాలని సూచించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్శాఖ అధికారులు రోడ్లకు ఇరువైపులా బహుళ వరుసలో మొక్కలు నాటేందుకు అనువైన 521 ప్రాంతాలను గుర్తించారు. వీటిల్లో 818 కిలోమీటర్ల మేర మొక్కలు నాటవచ్చని అంచనా వేశారు. ఇప్పటివరకు 325 ప్రాంతాల్లో 447 కిలోమీటర్లలో 10.22 లక్షల మొక్కలను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్ష్యంలో 55 శాతాన్ని అధికారులు చేరుకున్నారు. రెండేండ్లల్లోనే రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెరిగి ప్రజలకు కనువిందు చేయనున్నాయి.