గోపాల్పేట, ఏప్రిల్ 28 : మండలంలోని చాకల్పల్లి, పొల్కెపహాడ్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జెడ్పీటీసీ మంద భార్గవి ప్రారంభించారు. అదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పనిచేస్తున్న వారికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు మద్ద తు ధర రూ. 1888 అందిసున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె మండల కేంద్రంలోని 1వ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో వైస్ చైర్మన్ గువ్వల రాములు, సర్పంచులు రజనీ, ఎంపీడీ వో కరుణశ్రీ,డీపీఎం అరుణ, ఏపీఎం సావిత్రి, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు శేషిరెడ్డి, రాంచంద్రారెడ్డి, ఉప సర్పంచులు అరవింద్రెడ్డి, అశోక్రెడ్డి వార్డు సభ్యులు నాగయ్య, బుచ్చయ్య, పులేందర్, శాంతయ్య, కృష్ణయ్య టీఆర్ఎస్ నాయకులు కోటీశ్వర్రెడ్డి, రాజు, మునీంద్ర, చెన్నరాయుడు, మల్లయ్య, శివ, రాములు, మనేశ్ పాల్గొన్నారు.
గోవర్ధనగిరి గ్రామంలో..
వీపనగండ్ల, ఏప్రిల్28 : మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని కొప్పునూర్ సింగిల్విండో చైర్మన్ నర్సింహా రెడ్డి, ఎంపీపీ కమలేశ్వర్రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కృష్ణయ్యలు బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ విద్యాసాగర్ రావు, సర్పంచులు చంద్రకళ, నర్సింహారెడ్డి ఎంపీటీసీ ఈశ్వరమ్మ, సింగిల్ విండో డైరెక్టర్లు చిట్యానాయక్, మద్దిలేటి సీఈవో నాగరాజు, టీఆర్ఎస్ శ్రేణులు వెంకటయ్య, రజాక్, వెంకటస్వామి, గోపి, రవీందర్రెడ్డి, రామన్గౌడ్ పాల్గొన్నారు.
పాన్గల్లో..
పాన్గల్, ఏప్రిల్ 28 : మండలంలోని దవాజీపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సర్పంచు వెంకటయ్యయాదవ్, ఎంపీటీసీ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఠాకూర్నాయక్, విండో సీఈవో భాస్కర్గౌడ్, విండో సిబ్బంది మాధవరావు, నాయకులు కోదండరామిరెడ్డి, యుగంధర్గౌడ్, సుదర్శన్ గౌడ్ పాల్గొన్నారు.