మంచిర్యాల అర్బన్, మార్చి 23 : మంచిర్యాల పట్టణంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తలు మంగళవారం బోనాలు, బతుకమ్మలతో భారీ ర్యాలీ తీశారు. ఆర్అండ్ బీ గెస్ట్హౌస్ ఆవరణ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. దారిపొడవునా ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. తిరిగి ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు ర్యాలీగా వచ్చి ఆవరణలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కో ఆర్డినేటర్ అత్తి సరోజ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, టీబీజీకేఎస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
చెన్నూర్ ఐసీడీఎస్ కార్యాలయంలో..
ఉద్యోగులతో పాటు తమకూ వేతనాలను పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. చెన్నూర్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రమాదేవి, శారద, తదితరులు పాల్గొన్నారు.