నారాయణపేటలో కారు బోల్తా.. నలుగురు మృతి

హైదరాబాద్: నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో ఓ కారు బోల్తాపడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. హైదరాబాద్లోని బడంగ్పేటకు చెందిన ఎల్లయ్య కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్ణాటకలోని రాయచూర్ వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు గుడిగండ్ల వద్ద కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎల్లయ్య, ఆయన భార్య గోవిందమ్మ, ఆయన సోదరి శారద, కూతురు హారిక మృతిచెందారు. కారు డ్రైవర్ వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు ఎల్లయ్య మనుమడు నాలుగేండ్ల శర్విన్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే మృతులంతా ఉపాధికోసం పదేండ్ల క్రితం నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ వలస వెళ్లారని తెలుస్తున్నది.
తాజావార్తలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
- జీ7కు రండి.. ప్రధాని మోదీకి బ్రిటన్ ఆహ్వానం
- కర్నూలు వాసులకు గుడ్ న్యూస్.. ఎయిర్ పోర్ట్కు డీజీసీఏ అనుమతి
- అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?
- మరిది కోసం సినిమా సెట్ చేసిన సమంత..!
- పెళ్లి చేయమన్నందుకు కొడుకుపై దాడిచేసిన తండ్రి