హైదరాబాద్: మాతృ దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్తుగా రూపుదిద్దుకున్నాయని ట్వీట్ చేశారు. తన మాతృమూర్తితో దిగిన ఫొటోను పోస్టు చేశారు. మాతృమూర్తులు మనకోసం నిస్వార్ధంగా, ప్రేమతో చేసే వెలకట్టలేని సేవలకు గౌరవార్ధం మనం ఈరోజును నిర్వహించుకుంటున్నాం. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు, వందనాలు. తల్లుల త్యాగాలే బిడ్డల భవిష్యత్తుగా రూపుదిద్దుకున్నాయి అని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి