హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సాగునీటిశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐఈఏఎం) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటివరకు వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల వారీగా సాగునీరు, తాగునీరు అవసరాలతో కలుపుకుని 418.134 టీఎంసీల నీటిని ఈ ఏడాది వానకాలంలో వినియోగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని కమిటీ నిర్ణయించింది.
ఎస్సారెస్పీ ఎగువన ఉన్న మొత్తం 4,62,920 ఎకరాల ఆయకట్టుకు, దిగువన మొత్తం 7,75899 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రతిపాదనలు తయారు చేసింది. ఆదిలాబాద్ టెరిటోరియల్లోని కడెం, సదర్మాట్, సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులు మొత్తంగా 1,36,715 ఎకరాలకు, నిజాంసాగర్, కౌలాస్నాలా, పోచారం ప్రాజెక్టుల కింద 1,35,325 ఎకరాలకు, నిజామాబాద్లోని అలీసాగర్, గుత్ప, చౌట్పల్లి, రామడుగు ప్రాజెక్టుల కింద 1,07,794 ఎకరాలకు, సంగారెడ్డిలోని సింగూరు, నల్లవాగు పాజెక్టుల కింద 46,030 ఎకరాలకు, వరంగల్లో దేవాదుల ప్రాజెక్టు కింద 3,49,339 ఎకరాలకు, మంచిర్యాలలో గొల్లవాగు, నీల్వాయి, ర్యాలివాగు, ఎన్టీఆర్ సాగర్, వట్టివాగు, కుమ్రంభీం, పీపీరావు ప్రాజెక్టుల కింద 1,06,767 ఎకరాలకు, ఖమ్మంలో వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల కింద 24,740 ఎకరాలకు, కొత్తగూడెంలో కిన్నెరసాని, పెద్దవాగు, తాలిపేరు, ఎల్టీ బయ్యారం ప్రాజెక్టుల కింద 44,260 ఎకరాలకు, సాగునీరు అందించాలని నిర్ణయించారు. నల్లగొండలో నాగార్జునసాగర్, ఎస్సెల్బీసీ, ఆసిఫ్నగర్, దిండి ప్రాజెక్టుల కింద మొత్తం 9,54,610 ఎకరాలకు, సూర్యాపేటలో ఎస్సారెస్పీ స్టేజ్ 2, మూసి ప్రాజెక్టుల కింద 4,02,105 ఎకరాలకు, వనపర్తిలోని ప్రియదర్శిని జూరాల, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్ ప్రాజెక్టుల కింద 4,88,796 ఎకరాలకు, మహబూబ్నగర్లోని కోయిల్సాగర్, భీమా-1 కింద 1,61,250 ఎకరాలకు, నాగర్కర్నూల్లోని కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,43,322 ఎకరాలకు సాగునీరు అందించాలని ఎస్సీఐఈఏఎం ప్రతిపాదించింది.