హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఇవాళ కొత్తగా 3,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది చనిపోయారు. 4,976 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 46,946 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇవాళ 71,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 594 పాజిటివ్ కేసులు, రంగారెడ్డిలో 265, మేడ్చల్ జిల్లాలో 239 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.