హుజురాబాద్: ఆటోనగర్ కార్మికులు 20ఏండ్లుగా స్థలం కోసం ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగారు, కానీ నేడు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో 10 ఎకరాల స్థలంలో సుమారు 355 మందికి పైగా నిరుపేద కార్మికులకు స్థలాలు ఇవ్వడం జరిగిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.మెకానిక్ లకు ఎటువంటి సహాయమైనా చేస్తామని, 350 మంది కార్మికుల సౌకర్యాల కోసం రోడ్లు, ఇతర భవన నిర్మాణాల కోసం రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆర్ధిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
మెకానిక్ షెడ్లు అన్నింటినీ స్థలంలోకి తీసుకురావాలని ,కార్మికులకు సంబంధించిన అన్నిషెడ్లు రావడం వల్ల పట్టణంలో ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆయన తెలిపారు. కార్మికుల్లో ఐక్యత ఉండాలని, టిఆర్ఎస్ ప్రజల కోసం పని చేస్తుందని, బీజేపీ ప్రజలను వంచించడానికి పనిచేస్తుంది.పేదలకు ఏం చేస్తుంది…? బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని, ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తుందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
ఆటోనగర్అనేది కార్మికులకు ఓ వరం లాంటిది. నెల నెలా అద్దె కట్టకుండా కార్మికులకు సహాయం చేశామని అన్నారు. కార్మికుల్లో ఆటోనగర్ వాసులకు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్
ఇస్తామని చెప్పారు. దొడ్డు వడ్లు కొనం అని కేంద్రం అంటుంది, రైతులు ఎటూ పోవాలి, కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం , పేదల ప్రభుత్వం ప్రజలను పన్నులతో వంచిస్తున్న బీజేపీ కావాలా, పేదలకు సహాయం చేస్తున్న టిఆర్ఎస్ కావాలా! ఆలోచించాలి..అని హరీశ్ రావు పేర్కొన్నారు.