హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 3,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది మరణించారు. రాష్ర్టంలో ప్రస్తుతం 44,395 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 4,801 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇవాళ 65,997 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 534 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చల్ జిల్లాలో 219 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.