హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం 67 వేల మందికి పరీక్షలు నిర్వహించగా.. 337 మందికి పాజిటివ్గా తేలింది. జీహెచ్ఎంసీలో 91, మల్కాజిగిరిలో 28, రంగారెడ్డిలో 37, నిర్మల్లో 18, కేసులు నమోదైనట్టు సోమవారం బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది.
12 మంది హాస్టల్ విద్యార్థులకు పాజిటివ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్టీ వసతి గృహంలో 12 విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పురా ణం సతీశ్కుమార్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది.
13 వేల మందికి వ్యాక్సిన్
రెండోదశ వ్యాక్సినేషన్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 13,034 మంది తొలిడోసు తీసుకున్నారు. 528 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇప్పటివరకు తొలిడోసు తీసుకున్న వారి సంఖ్య 72 వేలకు, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 2.19 లక్షలకు చేరింది.