హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చి హామీని నెరవేర్చారని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని సబితా ఆనంద్ హాస్పిటల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.
జోన్ల పునర్వీవ్యవస్థీకరణపై పార్లమెంటులో తన గళాన్ని వినిపించి వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషి చేసిన ఎంపీ రంజిత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి