నిమ్మరసం, పసుపు.. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పసుపులను కలుపుకుని తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* నిమ్మరసం, పసుపులను గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
* జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గి కణజాలం రక్షింపబడుతుంది.
* కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమం సేవిస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఈ సీజన్లో ఎదురయ్యే శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
* చర్మం సంరక్షింపబడుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ సీజన్లో చర్మం పగలకుండా ఉంటుంది.