భువనగిరి అర్బన్: బైరాన్పల్లి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న బైరాన్పల్లిలో నిర్వహించే సంస్మరణ సభకు అధిక సంఖ్యలో నాయకులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు అనంద్ బాస్కర్ అన్నారు. భువనగిరి పట్టణంలోని ఖిల్లా సమీపంలో చలో వీరబైరాన్పల్లి పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 ఆగస్టు 27న బైరాన్పల్లిలో రజాకార్లతో పోరాడి 118 మంది ప్రాణత్యాగం చేశారన్నారు.
వారి పోరాటానికి గుర్తుగా ఈ సంవత్సరం మొదటిసారిగా బైరాన్పల్లి సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్న్తామన్నారు. వారి ఆత్మశాంతి కోసం సాముహిక పిత్రృయజ్ఞం, పిండ దాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బైరాన్పల్లి బురుజును చారిత్రక నిర్మాణంగా నిర్థారించాలని కేంద్ర పురావస్తు శాఖ మంత్రి కిషన్రెడ్డికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశామన్నారు. ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని ఆయన పిలపునిచ్చారు.