సీఎం కే చంద్రశేఖర్రావు సమక్షంలో ఎన్ఆర్ఐ-పువ్వాడ ఫౌండేషన్ అందజేత
ఖమ్మం దవాఖానలో పేదల చికిత్సకు వినియోగం
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం సంయుక్తంగా రూ.2.5 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రాష్ట్ర ప్రభత్వానికి అందించాయి. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వాటిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అందజేశారు. వీటిని అమెరికా నుంచి తెప్పించినట్టు, ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖానలో పేదలకోసం వినియోగించనున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కాన్సంట్రేటర్ల దిగుమతికి సునీల్ చావలి సహకరించినట్టు వెల్లడించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్అలీ, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.