సంగారెడ్డి : మునిపల్లి మండలం కంకోల్ వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 240 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేసినట్లు మునిపల్లి ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కంకోల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఓ వాహనంలో కూరగాయల బాక్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, మునిపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ సీజ్ చేశారు. గంజాయిని విశాఖపట్టణం నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయిని తరలిస్తున్న బొలేరో వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.