గట్టు, ఏప్రిల్ 30: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యత లభిస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. గట్టు, మాచర్లలలో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా(గిఫ్ట్)లను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. అన్ని మతాల ముఖ్య పండుగల సందర్భంగా కానుకలు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముస్లింలు రంజాన్ పండుగను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమాల్లో తాసిల్దార్ అహ్మద్ఖాన్, సర్పంచులు ఉప్పరి ధనలక్ష్మి, సిద్ధిరామప్ప, ఎంపీపీ విజయ్కుమార్, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటేశ్, జెడ్పీ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఇమాంసాబ్, వాహబ్, క్యామ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, బలిగేర హనుమంతు, హనుమంతురెడ్డి, రామునాయుడు, అలీ, శ్రీనివాస్రెడ్డి, గద్వాల తిమ్మప్ప, బజారి తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీలకు రంజాన్ తోఫా
ధరూరు, ఏప్రిల్30: ముస్లిం మైనార్టీలకు రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం అందజేస్తున్న కానుకలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అందజేశారు. మండల కేంద్రంలో పాత మసీద్ ఆవరణలో శుక్రవారం రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రఘవర్ధన్రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ దౌలన్న, జాకీర్, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్గౌడ్ పాల్గొన్నారు.