కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం చర్యలు
అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు
45 ఏండ్లు దాటినవారు వ్యాక్సిన్ వేసుకునేలా ఇంటింటికీ సర్వే
రంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ)/వికారాబాద్: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న వేళ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా వైరస్ కట్టడికి మరింత విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా వ్యాక్సిన్పై ప్రజల్లో అపోహలను తొలగించి 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నది. అందుకోసం కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఇంటింటికీ సర్వే నిర్వహించి 45 ఏండ్లు పైబడినవారి వివరాలను సేకరించడంతోపాటు టీకా తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 25 వేల మందిని గుర్తించారు. ఇందుకోసం ప్రతి మండలానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించకుండా బయట తిరిగితే రూ.వెయ్యి జరిమానాతోపాటు కేసు కూడా నమోదు చేస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ను జిల్లా వైద్యారోగ్య శాఖ వేగవంతం చేసింది. రోజుకు 7 వేల మందికి టీకా వేస్తుండగా.. ఇప్పటివరకు 1.50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను జిల్లా యం త్రాంగం చర్య లు చేపట్టింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రధానంగా వ్యాక్సినేషన్పై అవగాహనతోపాటు ట్రేసింగ్, టె స్టింగ్… ట్రాకింగ్ పై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. 45 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలా మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ముందుగా ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకునేలా జిల్లా అంతటా విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లా యం త్రాంగం నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే ము ఖ్యంగా 45 ఏండ్లు దాటిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడమే లక్ష్య ంగా జిల్లా ఉన్నతాధికారులు వైద్యారోగ్యశాఖ అధికా రులతోపాటు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేనిదే తిరగకూడదనే నిబంధనను కూడా ప్రభుత్వం తీసుకు వచ్చింది, ఒకవేళ మాస్క్ లేనట్లయితే రూ.వెయ్యి రుసుం తో పాటు కేసు కూడా నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిబంధనను జిల్లాలో కూడా కఠినంగా అమ లుచేసేందుకు నిర్ణయించారు. మరోవైపు జిల్లా కలెక్టరేట్లోనూ కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నారు, కలెక్టరేట్ కార్యాలయం లోకి వచ్చే వారందరినీ థర్మామీటర్తో పరిశీలించిన అనంతరమే అనుమతిస్తున్నారు. ఎవరికైతే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లు తేలితే వారిని కలెక్టరేట్లోకి అనుమతించడం లేదు. అదేవిధంగా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రెండు, మూడు రోజుల్లో థర్మామీటర్లతో ప్రతీ ఒక్కరిని పరిశీలించన అనంతరమే అనుమతించేందుకు నిర్ణయించారు.
వ్యాక్సినేషన్పై విస్తృత అవగాహన…
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ మరింత పెంచేందుకుగాను తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ జిల్లా వైద్యా రోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ అందు బాటు లోకి వచ్చినప్పటికీ చాలా మంది అపోహలతో వ్యాక్సినేషన్కు దూరంగా ఉంటున్న దృష్ట్యా వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని 13 మున్సిపాలిటీ, 3 కార్పొరేషన్లలో నేటి నుంచి కరోనాపై విస్తృతంగా అవగాహన కల్పిం చనున్నారు. ఆయా మున్సిపాలిటీల అధికారులతోపాటు వైద్యా ధికారులు అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే విధంగా మండలాల్లో ఎంపీడీవో, డిటీ, ఏపీవో,ఎస్ఐ, వైద్యా ధికారితో ఒక్కొ మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేసేం దుకు నిర్ణయించారు. మున్సిపాలిటీల్లో, మండలాల్లో వ్యాక్సి నేషన్పై అవగాహన కల్పించడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి ప్రక్రియలపై మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోనున్నారు.కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. జిల్లాలో గత మూడు రోజులుగా కరోనా కేసులను పరిశీలిస్తే 200లకుపైగా పాజిటివ్ కేసులు నమో దవుతున్నాయి. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జ్వరం తదితర లక్షణాలున్న ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేసేందుకు నిర్ణయించారు. కరోనా పరీక్షలను వీలైనంతా ఎక్కువ పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా పాజిటివ్ నిర్దారణ అయిన వారి కాం టాక్ట్స్ను గుర్తించి వారికి పరీక్షలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సంబంధించి 30 మంది కాంటాక్ట్ వివరాలను సేకరించి ప్రత్యేక యాప్లో పొం దుపరుస్తున్నారు.
ఇంటింటి సర్వే…
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకుగాను వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 60 ఏండ్లు దాటిన వారికి, 45 ఏండ్లు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వ గా, గత వారం రోజులుగా 45 ఏండ్లు పైబడిన వారికి కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అం దరూ ముందుకు రాకపోవడంతో ఓ వైపు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించడంతోపాటు మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే వికారాబాద్ జిల్లాలో కూడా కొనసాగుతున్నది. వివరాలను సేకరిస్తుండడంతోపాటు వ్యాక్సిన్ వేసుకోవాలని సర్వేలో భా గంగా ఆశా వర్కర్లు సూచిస్తున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తం గా సర్వేలో భాగంగా 25 వేల మంది వివరాలను సేకరించారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ పెంచింది. ప్రస్తుతం రోజుకు 7 వేల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. జిల్లాలోని 40 ప్ర భుత్వాసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
వ్యాక్సిన్తో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వా రందరూ కరోనా వ్యా క్సిన్ను వేసు కోవాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సూచించారు. కరోనా వ్యాక్సిన్తో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని, వ్యాక్సిన్తో కరోనా వైరస్ను ఎదుర్కొనేంత వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్పై మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించాం. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.
– అమయ్కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్
టెస్ట్ల సంఖ్య పెంచాం
రోజు రోజుకు జిల్లాలో కేసుల సం ఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టార్గెట్కు మించి కరోనా పరీక్షలు చేస్తున్నాం. మున్సిపల్ ఏరియాలో వార్డులో, మండలంలోని గ్రామా ల్లో కరోనా పరీక్షల సంఖ్య పెంచాం. కరోనాను కట్టడి చే యాలంటే ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలి. భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ను వాడాలి వీలైనంత వరకు పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు దూరంగా ఉండాలి.
-సుధాకర్షిండే వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
ఇవి కూడా చదవండి
రమ్యకృష్ణను ఏడిపించిన సీనియర్ హీరోయిన్ రేఖ
ఊరు పేరు తెలియని వాడు చెప్తే నేనెందుకు వింటా: నాగార్జున
మరీ ఇంత పక్షపాతం పనికి రాదు సుకుమార్ గారు..!
పాప్ సింగర్ స్మిత యువర్ హానర్ షో ప్రోమో