హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): దేశంలో బయోవ్యర్థాలు భయపెట్టేంతగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా దవాఖానలు, క్వారంటైన్, ఐసొలేషన్ సెంటర్లు కొవిడ్ బాధితులతో నిండిపోవడంతో రోజురోజుకూ టన్నుల కొద్దీ బయోవ్యర్థాలు వెలువడుతున్నాయి. రోజుకు సగటున 203 ట న్నులు బయోవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈనెల 10 అత్యధికంగా 250 టన్నుల వేస్ట్ వెలువడినట్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) తాజా గా విడుదల చేసిన జాబితాలో పేర్కొన్నది. తెలంగాణ లో ఇది 4.99 టన్నులు ఉండగా.. దేశంలో అత్యధికం గా కేరళలో 23.71 టన్నులుగా ఉన్నది. తర్వాత స్థానంలో గుజరాత్ 21.98 టన్నులు వెలువడుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరిలో దేశంలో 74 టన్నులు ఉండగా.. మే నెలలో 203 టన్నులకు పెరగ డం ఆందోళన కలిగిస్తున్నది. ఇలా నిత్యం దవాఖాన లు, డయాగ్నస్టిక్ సెంటర్లు తదితరాల్లో వెలువడుతున్న బయోవేస్ట్ను దేశవ్యాప్తంగా సుమారు 198 కామన్ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాలకు తరలించి అక్కడే డిస్పోజ్ చేస్తున్నట్టు సీపీసీబీ తెలిపింది. తెలంగాణలో 11 కేంద్రాల్లో నిర్వీర్యం చేస్తున్నారు.
బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, నిబంధనలు
కొవిడ్ బయోమెడికల్ వేస్ట్ నిబంధనల ప్రకారం క్ల్లినికల్ జీవవ్యర్థాల నిర్వీర్యంపై మార్గదర్శకాలను పేర్కొంటూ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ను జారీచేసింది. ముఖ్యంగా బయోవేస్ట్ డిస్పోస్, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని సీపీసీబీ సూచించింది.
సీపీసీబీ నిబంధనల ప్రకారం జీవ, వైద్యవ్యర్థాలను వేరు చేయాలి. ఐసొలేషన్ వార్డుల్లోని వ్య ర్థాల వివరాలను విడిగా నమోదుచేయాలి.కొవిడ్ ఐసొలేషన్ వార్డుల ప్రారంభం, నిర్వహణ, నమూనా సేకరణ కేంద్రాల వివరాలు పీసీబీకి ఇ వ్వాలి. జీవవ్యర్థాలు, సాధారణ చెత్త సేకరణ, నిర్వహణకు ప్రత్యేక కార్మికులను నియమించుకోవాలి.
కొవిడ్ వ్యర్థాలను నిల్వచేయడానికి ఉపయోగించే కంటైనర్లు డబ్బాలు, ట్రాలీలకు లోపలా, బయటా, 1శాతం సోడియం హైపోక్లోరేట్ ద్రావణంతో ప్రతిరోజూ క్రిమిరహితం చేయడంతోపాటు ఐసొలేషన్ వార్డుల నుంచి వ్యర్థాలను సేకరించడానికి 50 మైక్రాన్ మందం గల రెండు పొరల (రెండు సంచులను) సంచులను ఉపయోగించాలి. తగిన రంగు సంకేతంతోపాటు, అదనంగా కొవిడ్-19 లేబుల్ అతికించిఉన్న ప్రత్యేక కంటైనర్లలో విడిగా సేకరించాలి.సీబీడబ్యూటీఎఫ్కు చెందిన అధీకృత సిబ్బందికి అందచేసే ముందు వ్యర్థాలను విడిగా ఒక తాత్కాలిక నిల్వగదిలో భద్రపర్చాలి.
సాధారణ ఘన వ్యర్థాలను (ఇంటి చెత్తను) యూ ఎల్బీలు గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించాలి. లేదా ఇంటి చెత్త పారవేతకు స్థానికంగా ఏ పద్ధతి అవలంబిస్తున్నారో అలాగే తొలిగించాలి. జీవ వైద్యవ్యర్థాలను, ఇంటి చెత్తను వేసేందుకు ప్ర త్యేక డబ్బాలను ఏర్పాటుచేసుకోవాలి. జీవ వైద్య వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు క్వారంటైన్ శిబిరాల/కేంద్రాల నిర్వాహకులు సీడబ్ల్యూటీఎఫ్ ఆపరేటర్కు ఫోన్చేసి పిలిపించుకోవాలి. హోం క్వారంటైన్ నుంచి మెడికల్ వ్యర్థాలను యూఎల్బీ ఇచ్చి న పసుపురంగు సంచుల్లో ప్రత్యేకంగా సేకరించాలి. ఈ సంచులను వాటి కొరకు ప్రత్యేకంగా తగి న సైజులో కేటాయించిన డబ్బాల్లో ఉంచాలి.
ప్రత్యేకంగా ట్రాకింగ్ యాప్
దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న బయోమెడికల్ వేస్ట్ను కామన్ బయోమెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాలకు తరలించాలి. కానీ, కొందరు డం పింగ్ యార్డులు, శివారుల్లోని ఖాళీప్రదేశాల్లో డం ప్చేస్తున్నారు. బయోవ్యర్థాల తరలింపును పర్యవేక్షించేందుకు సీపీసీబీ ప్రత్యేకంగా బయోవేస్ట్ ట్రా కింగ్ యాప్ను రూపొందించింది. దేశంలోనే తొలి సారిగా తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బో ర్డు బయోవ్యర్థాలను తరలించే వాహనాలను జీపీఎస్తో అనుసంధానం చేసింది. వాటిని టీఎస్పీసీబీ కేంద్ర కార్యాలయం నుంచి జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా బహిరంగ ప్ర దేశాల్లో వేస్తే పీసీబీ పెట్రోలింగ్ బృందాలకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.