నాంపల్లి నుమాయిష్ వాయిదా

హైదరాబాద్ : కొత్త సంవత్సరంతో పాటు హైదరాబాద్కు ప్రతి ఏడాది మరో పండుగ వచ్చేది. అదే నాంపల్లి నుమాయిష్. కానీ ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభమయ్యే నుమాయిష్ను వాయిదా వేశారు. రేపట్నుంచి ప్రారంభం కావాల్సిన నుమాయిష్ను వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, రాష్ర్ట మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి కారణంగానే నుమాయిష్ను కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభమయ్యే నుమాయిష్.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగుతుండేది. వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 1500 నుంచి 2 వేల వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలు, కిచెన్ సామాను నుంచి మొదలుకొంటే.. ధరించే బట్టల వరకు ఈ స్టాళ్లల్లో లభిస్తాయి. ఒక ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు ఈ ఎగ్జిబిషన్లో దొరుకుతుంది. తినుబండారాల కోసమ ఎగ్జిబిషన్కు వెళ్తారనడంలో కూడా సందేహం లేదు.
తాజావార్తలు
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: హైద్రాబాదీలకు ఫుల్ జాయ్
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు