మన దేశంలోని రేడియో సేవలకు 1936 లో సరిగ్గా ఇదే రోజున ఆలిండియా రేడియోగా నామకరణం చేశారు. ఇంతకు ముందు దీనిని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని పిలిచేవారు. తర్వాత దీనిని ఆకాశ్వాణి అని కూడా పిలిచారు. మన దేశంలో రేడియోను 1927 జూలై 23 న ప్రారంభించారు. రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయితో ప్రారంభమైన ఈ ప్రయాణం 94 సంవత్సరాల తర్వాత దేశ జనాభాలో 99.18% కి చేరుకుంది.
బొంబాయిలో ప్రారంభమైన 5 నెలలకు కోల్కతా నుంచి ప్రసారాలు ప్రారంభించారు. 12 ఏండ్ల అనంతరం 1939 అక్టోబర్ నెలలో ఆలిండియా రేడియో విదేశీ సేవ ప్రారంభించారు. అదే ఏడాది మొదటిసారి, పాష్టో భాషలో ప్రసారం కూడా మొదలైంది. స్వాతంత్ర్య సమయంలో భారతదేశంలోని 9 రేడియో స్టేషన్లు క్రమం తప్పకుండా ప్రసారం చేశాయి.
ఆల్ ఇండియా రేడియోకు 1956 లో ఆకాశ్వాణి అని పేరు పెట్టారు, మరుసటి ఏడాది వివిద్ భారతి ప్రారంభమైంది. క్రమంగా ఆలిండియా రేడియోలో కార్యక్రమాలు విస్తరించి.. సంగీతం, నాటకం, క్రికెట్ వ్యాఖ్యానం, విభిన్న ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం ఆలిండియా రేడియో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార సంస్థగా విలసిల్లుతున్నది. దేశవ్యాప్తంగా 262 రేడియో స్టేషన్ల ద్వారా భారతదేశ జనాభాలో 99.18% జనాభాకు చేరుకుంటున్నది. 100 కి పైగా దేశాలలో 25 కి పైగా భాషలలో ప్రసారాలు చేస్తున్నారు. న్యూస్ డివిజన్ ప్రతిరోజూ వివిధ భాషల్లో 647 న్యూస్ బులెటిన్లను ప్రసారం చేస్తున్నది.
2014: సిమోనా హాలెప్ను ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా
2009: స్క్రీన్ రైటర్, థియేట్రికల్ డైరెక్టర్, కవి, నటుడు హబీబ్ తన్వీర్ కన్నుమూత
2000: కర్ణాటకలోని కలబురగి జిల్లాలో సీరియల్ చర్చి పేలుళ్లు
1992: బ్రెజిల్లో తొలి ప్రపంచ మహాసముద్ర దినోత్సవం ప్రారంభం
1972: వియత్నాం యుద్ధంలో తీసిన ఫొటోలకు అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ నిక్కు పులిట్జర్ బహుమతి ప్రదానం
1948 : ఎయిర్ ఇండియా మొదటి అంతర్జాతీయ విమానం ప్రారంభం
1915: లోకమాన్య తిలక్ రాసిన ‘గీత రహస్యా’ ప్రచురితం
కొత్త సేవలు : స్పీడ్ పోస్ట్లో అస్తికల నిమజ్జనం
ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..