హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు గా చేపట్టనున్న భూముల డిజిటల్ సర్వే కు 29 టెండర్లు వచ్చాయి. ఈ టెండర్ల దాఖలు గడువు ఆదివారంతో ముగిసిం ది. కమిషన్ పర్యవేక్షణలో సోమవారం హైదరాబాద్లోని సర్వేభవన్లో టెండర్బాక్స్ను తెరిచారు. మొత్తం 29 సంస్థ లు ముందుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీ, టెండర్లు దాఖలుచేసిన సంస్థల సామర్థ్యం, చరిత్ర, సర్వే జరిపే విధా నం, వేగం తదితర సాంకేతిక అంశాల ను పరిశీల్తిస్తుంది. అర్హత సాధించిన సంస్థల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిరస్తుంది. మరోవైపు సర్వే చేయాల్సిన గ్రామాల జాబితా సిద్ధమవుతున్నది. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో 3 గ్రామాల చొప్పున మొత్తం 27 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ను చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కలెక్టర్లు ప్రాథమికంగా గ్రామాలను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ జాబితాను ప్రభుత్వానికి పంపనున్నా రు. పరిశీలన అనంతరం తుది జాబితా ఖరారుచేస్తారు. ఆ లోగా ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఎంపికైన ఏజెన్సీలతో గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.