నవాబ్పేట మార్కెట్లో 41,763 బస్తాల ధాన్యం కొనుగోలు
మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు
నవాబ్పేట, జూన్ 13 : రైతుల ఖాతాల్లో త్వరలోనే ధా న్యం డబ్బులు జమ చేస్తామని నవాబ్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ డీఎన్ రావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులోని తన చాంబర్లో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. నవాబ్పేట వ్యవసాయ మార్కెట్యార్డులో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 41,76 3 బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. నవాబ్పేట, యన్మన్గండ్ల, దాయపంతులపల్లి గ్రామపంచాయతీలకు చెందిన రైతుల ధాన్యం మాత్రమే నవాబ్పేట మార్కెట్యార్డులో కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో.. సమయానికి గన్నీబ్యాగులు అందజేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇప్పటికే మార్కెట్ గోదాము, తీగల్పల్లి కనకదుర్గ రైస్మిల్, నవాబ్పేట రైతువేదిక, నవాబ్పేట, యన్మన్గండ్ల ఉన్నత పాఠశాలల్లో నిల్వ చేసినట్లు వివరించారు. ఇప్పటికే కొంతమంది రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశామని, మిగతా వారికి కూడా నాలుగైదు రోజుల్లో జమ చేస్తామన్నారు. రైతుల కల్లాల నుంచి ట్రాక్టర్లలో ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువచ్చిన కిరాయి డబ్బులు కూడా తిరిగి రైతులకు చెల్లిస్తున్నట్లు తెలిపారు.