యాదాద్రిలో వైభవంగా నిరటోత్సవం

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారికి నిరటోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేకంగా అలకంరించి శ్రీరంగనాధుడిని ప్రసన్నం చేసుకునే వేడుకలు చేపట్టారు. గోదాదేవికి మహిళ భక్తులు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. అమ్మవారు స్వామివారి కలిసి మంగళస్నానాన్ని ఆచరిస్తారని, అనంతరం కల్యాణం జరుగబోతున్న నేపథ్యంలో ఈ నిరాటోత్సవాలు జరుపుతున్నారని, ఆదివారం నుంచి ఐదురోజుల పాటు నిరటోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహచార్యులు తెలిపారు.
ధనుర్మాసోత్సవం 26వ రోజులో భాగంగా బాలాలయంలో వేకువజామూనే ఆలయ అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు అత్యంత వైభవంగా చేపట్టారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించి భక్తులకు వినిపించారు.
ఇవి కూడా చదవండి
భయపడొద్దు..బాగవుతుంది
భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తొలి నటి ఎవరంటే..?
పెండ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్
తాజావార్తలు
- ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్
- ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి హరీశ్ రావు
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా
- ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!
- హల్దీ వేడుకల్లో వరుణ్ ధావన్ హల్చల్
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్
- విజయవంతంగా ఆకాశ్-NG క్షిపణి పరీక్ష
- ఢిల్లీలో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా
- పెళ్లి విందులో వైరల్ అయిన వంటకం