భోపాల్ : కొవిడ్-19 భారత్ వేరియంట్ పై ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆరోపించారు. ఈ ప్రత్యేక వేరియంట్ తోనే భారత్ లో సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్నదని అన్నారు. దేశ శాస్త్రవేత్తలు సైతం దీన్ని భారత వేరియంట్ గానే పిలుస్తున్నారని చెప్పారు. చైనాలో కొవిడ్ వేరియంట్ ప్రారంభమవగా, ఇప్పుడు భారత్ కరోనా వేరియంట్ వణికిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రధాని, రాష్ట్రపతి సైతం ఈ వేరియంట్ అంటే భయపడుతున్నారని చెప్పారు.
శాస్త్రవేత్తలు సైతం ఇండియన్ వేరియంట్ గా పిలుస్తుంటే బీజేపీ సలహాదారులు మాత్రమే దీన్ని అంగీకరించడం లేదని కమల్ నాథ్ పేర్కొన్నారు. ఇక కమల్ నాథ్ వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచ్చింది. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భారత్ వేరియంట్ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ టూల్ కిట్ లో భాగంగానే కమల్ నాథ్ వ్యాఖ్యలున్నాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా అన్నారు.