లాల్గడి మలక్పేటలో ఘటన
రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్
శామీర్పేట, మే 16: ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం, లాల్గడి మలక్పేట గ్రామానికి చెందిన పొలంపల్లి లక్ష్మి(60) ఒంటరిగా ఉంటూ కూలీ పని చేసుకుంటుంది. భర్త చనిపోగా.. కూతుళ్లకు పెండ్లిచేసి అత్తారింటికి పంపింది. కాగా.. గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ భవనంలో హత్యకు గురై ఉంది.. ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ సుధీర్కుమార్, పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.. తలకు తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో హత్యచేసి ఉంటారని భావించి.. క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ను రంగంలోకి దించారు. మృతదేహం పరిసర ప్రాంతాల్లో డాగ్స్ పర్యటించి మృతదేహం వద్దకు వచ్చి ఆగిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పేట్బషీర్బాగ్ ఏసీపీ రామలింగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు తాడు కనిపించడం లేదని సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.