అహ్మదాబాద్: కరోనా రోగుల వార్డు బిక్కుమంటూ నిశ్శబ్దంగా ఉంటుందని అనుకుంటున్నారా.. అదేం లేదని రుజువు చేశారు గుజరాత్ మెడికోలు. అహ్మదాబాద్ లోని ఎస్వీపీ ఆస్పత్రిలోని కోవిండ్ వార్డులో దిగాలుగా ఉన్న కరోనా రోగులను ఉత్సాహ పరిచేందుకు వారు అంత్యాక్షరి ఆట నిర్వహించారు. ముగ్గురు మెడికోలు ఈ అంత్యాక్షరి నిర్వహించారు. అందులో ఒకరు గిటార్ కూడా వాయించడం విశేషం. నర్సింగ్ సిబ్బంది. మెడికోలు కలిసి ముందుగా ఆస్పత్రి యాజమాన్యానికి ఈ విషయం చెప్పి అనుమతి పొందారు. ఆపీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డాక్టర్ ఆశిస్ రాజాతో కూడా వారు చర్చించారు. ఆ తర్వాత అనుమతి ఇచ్చారు. మెడికోలు నిర్వహించిన అంత్యాక్షరి ఆసక్తికరంగా సాగింది. పలువురు కోవిడ్ రోగులు ఉత్సాహంగా ఇందిలో పాల్గొన్నారు. ఈ అంత్యాక్షరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.