హైదరాబాద్ : ఏపీలో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపివేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సుల ముందస్తు రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ సరిహద్దు వరకే బస్సులు నడుపనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీలో పగటి కర్ఫ్యూ ఇవాళ్టి మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చింది.
రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. రెండువారాల పాటు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ సైతం నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ముందస్తు టికెట్ రిజర్వేషన్ల సదుపాయం నిలిపివేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.