యువకుడు సజీవ దహనం
తిరుమల, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆస్థాన మండపంలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఈ ఘటనలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. ఆస్థాన మండపం కిందిభాగంలో ఉన్న దుకాణంలో వేకువజామున షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో యువకుడు నిద్రలో ఉండటంతో మంటల్లో చిక్కుకొని మృతిచెందాడు. అతడు తిరుచానూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ మల్లిరెడ్డిగా గుర్తించారు. అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ.40 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా.