పూరీ జగన్నాథ్, మహేశ్బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పోకిరి, 2006లో వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 15 ఏండ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో రికార్డుల ప్రభంజనం సృష్టించింది. రూ.10 కోట్లతో నిర్మించబడ్డ పోకిరి రూ.70 కోట్ల గ్రాస్ తో రూ.40 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది.
పూరీ జగన్నాథ్ బద్రీ సినిమాకు ముందే ఈ ప్టోరీ రాసుకున్నాడట. అంతేకాదు హీరోగా రవితేజను అనుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఉత్తమ్ సింగ్..సన్నాఫ్ సూర్య నారాయణ టైటిల్ కూడా అనుకున్నాడు. కానీ పలు కారణాలతో సినిమా తెరరూపం దాల్చలేదు. కొంతకాలం తర్వాత ఇదే స్టోరీ మహేశ్ దగ్గరకు వచ్చింది.మహేశ్ ఎంట్రీ తర్వాత పూరీ స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసి పోకిరి పేరుతో తెరకెక్కించాడు.
ఇవి కూడా చదవండి..
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్లో స్టిల్
థియేటర్ కు వెళ్లకుండా రాధే చూడాలంటే..?
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో