గూడూరు, ఏప్రిల్19: ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన మృతుల కుంటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ హామీ ఇచ్చారు. సోమవారం మండలం లోని సోమ్లాతండాకు చెందిన బోడ సునీల్ ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరా మర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సునీల్ ప్రాణాలు రక్షించుకునేందుకు అన్ని విధాలా ప్రయ త్నం చేసిందని సునీల్ మృతిచెందడం బాధాకరమన్నారు. అనంతరం గూడూరు ఎస్సీ కాలనీలో ఇటీవల మృతి చెందిన రూపాని ఎల్లమ్మ కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం, రూ. 2 వేలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం చంద్రుగూడెంలో తాటిపై నుంచి మరణించిన నలమాస ఎల్ల య్య కుటుంబాన్ని పరామర్శించి, రూ. 5వేల సాయం చేశారు.
ఏజెన్సీలో గీతకార్మికులను ఆదుకుంటాం
ఏజెన్సీ మండలంలో కల్లుగీత కార్మికులు వృత్తిరీత్యా తాటి చెట్టుపై నుంచి పడి ప్రాణాలను కోల్పోవడం బాధాకరమన్నారు. గూడూరు మండలంలో ఈ మధ్యకాలంలో నలుగురు గీత కార్మి కులు చనిపోయారని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఏజెన్సీ గ్రామాలలో గత ప్రభుత్వాల కాలంలో సొసైటీలను రద్దు చేసిందని, దీంతో గీతకార్మిలకు ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షల ఎక్స్గేషియా అందడంలేదన్నారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి ఏజెన్సీలో గీత కార్మికులకు లబ్ధి చేరేలా మాట్లాడుతానన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ సుజాత, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు వెంకటకృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ముక్కా లక్ష్మణ్రావు, నాయకులు సంపత్రావు, కోడి రవి, నూకల సురేందర్, కఠార్సింగ్, చీదురు వెంకన్న, ఏ వెంకన్న, రహీం, సురేశ్ పాల్గొన్నారు.