ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఎం.వీరభద్రం దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతిరెడ్డి, పి.మన్మథరావు నిర్మించనున్నారు. దర్శకుడు ఎం.వీరభద్రం చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆది సాయికుమార్ హీరోగా నా దర్శకత్వంలో వచ్చిన ‘చుట్టాలబ్బాయి’ మంచి విజయం సాధించింది. మరోసారి మా కలయిలో సినిమా రాబోతుండటం ఆనందంగా ఉంది. వాణిజ్య అంశాలు కలబోసిన విభిన్న కథా చిత్రమిది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీలేకుండా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, రద్శకత్వం: ఎం.వీరభద్రం.