కరోనా ప్రభావంతో పెరిగిన వినియోగం
లాక్డౌన్ నుంచి నెట్ ఖర్చు రెట్టింపు
రోజంతా ఇంటర్నెట్ పైనే..
ధన్వాడ, ఏప్రిల్ 15 : ఈ ఊరు ఆ ఊరు అని తేడా లే కుండా నేడు ఎటు చూసినా ప్రజలు ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. ప్రధానంగా యువత ఇంటర్నెట్ సేవలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇంటర్నెట్ వినియోగిస్తూ సినిమాలు, పాటలు, వార్తలు వింటూ గడుపడం వల్ల నెట్ వినియోగం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లో నెట్ ఖర్చు రె ట్టింపు అయ్యింది. మొబైల్ డేటా ఆన్ చేసి ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. వా ట్సాప్, ఫేస్బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. అంతేకాక ఆన్లైన్ షాపింగ్లు, నగదు చెల్లింపులతోపాటు అన్ని రకాల నెల సరి బి ల్లులైన ఎలక్ట్రిసిటీ, కేబుల్, వాటర్, ఫోన్ బిల్లులాంటి చెల్లింపులతోపాటు బ్యాంకు ఖాతా లావాదేవీలను సైతం ఇంటర్నెట్ ద్వారానే వినియోగిస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు రకారకాల పుస్తకాలు, గ్రంథాలయాలు కూడా ఇంటర్నెట్ లో లభిస్తుండడంతో వాటిపై ఆసక్తి చూపుతున్నారు.
సమాచారం తెలుసుకోవడం కో సం ఈ-పత్రికలతోపాటు న్యూస్ మొబైల్ యాప్లపై ఆధారపడుతున్నారు. అదేవిధంగా పిల్లలు వివిధ రకాల ఆటలతోపాటు కార్టూన్లు, పాటలు, సినిమాలు, ఇతర వీడి యో గేమ్లు చూస్తూ సరదాగా గ డుపుతున్నారు. కరోనా వైరస్ ప్ర భావంతో స్కూళ్లు, కళాశాలలు, వి ద్యాసంస్థలు మూతపడడంతో అం దరూ ఇంటర్నెట్పై ఆసక్తిని పెంచుకున్నారు. అంతేకాకుం డా కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్నెట్లో పలు రకాల యాప్స్ ద్వారా ఆన్లైన్ తరగతులు బోధిస్తూ హోం వర్క్ లు ఇస్తున్నారు. వాటిని చూసి తల్లిదండ్రులు పిల్లలతో రా యించడం, చదివించడం చేస్తున్నారు. ఇక ప్రైవేట్ కంపెనీ ల్లో పని చేసే ఉద్యోగులు ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోం ద్వా రా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టించుకొని మొబై ల్ డేటా స్పీడ్, వైఫై స్పీడ్ తగ్గిపోవడం జరుగుతున్నది. పెద్ద పెద్ద నగరాల్లోనే ఇంటర్నెట్ వాడకం ఎక్కువైందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇప్పడు ఎక్కడ చూసినా చిన్న పిల్లవాడి నుంచి పెద్దల వరకు స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైపోతున్నది.
దీంతో ఎటు చూసిన ఇంటర్నెట్ వినియోగం పూర్తిగా పెరిగిపోయింది. అందరూ ఇంటర్నెట్ వినియోగించుకోవ డం వల్ల సరైన సమయంలో నెట్సేవలకు తీవ్ర అంతరా యం సైతం ఏర్పడుతున్నది.
ఇవి కూడా చదవండి
లాక్డౌన్లు పూర్తయితే ఈ కుక్కలాగే ఎంజాయ్ చేస్తా: ఆనంద్ మహీంద్రా
టీజీ సెట్.. ఐదో తరగతి దరఖాస్తుల గడువు పొడిగింపు