అన్నవరం : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ నాయకురాలు, హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూర్లో మీడియాతో ఆమె మాట్లాడారు.
నిన్న తిరుపతిలో జరిగిన చంద్రబాబు సభపై రాళ్ల దాడి జరిగిందనడం అవాస్తమని అన్నారు.
సానుభూతి కూడగట్టుకొని ఎన్నికల్లో విజయం సాధించాలనే రాళ్ల దాడి జరిగినట్లు టీడీపీ నాయకులు చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
రాళ్ల దాడి చేసి అలజడి సృష్టించాల్సిన అవసరం వైసీపీ లేదని అన్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం తిరుపతిలోని రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి కృష్ణాపురం ఠాణా వరకు రోడ్ షో నిర్వహించారు.
అక్కడ బహిరంగ సభలో తమపై కొందరు రాళ్ల దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఆయన ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి